వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
భూ బకాసురుడు చంద్రబాబు
26 Aug 2015 4:37 PM
కార్పొరేట్ సంస్థల కోసమే రాజధాని
బాబు పాలన అంతా మోసం.. మోసం..
ఈ నెల 29 నాటి బంద్ కు అంతా సహకరించాలి
విజయవాడ: కార్పొరేట్ సంస్థల కోసం రాజధానిని నిర్మించాలన్న దుర్భుద్దితో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అందుకే ప్రజల రాజధానిని పక్కన పెట్టేసి, ప్రజల కన్నీటితో రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు ఒప్పుకొన్నా, ఒప్పుకోక పోయినా అధికారం ఉంది కదా అని, మదం ఎక్కిన మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని జగన్ వివరించారు. బలవంతపు భూ సేకరణ కు వ్యతిరేకంగా విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నాలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు.
బలవంతంగా లాక్కొనే యత్నాలు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా చంద్రబాబు కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పంటలు పండే భూములు రెండు వేల ఎకరాలు మాత్రమే, మిగిలినదంతా మామూలు భూములే అంటూ కౌంటర్ ఫైల్ చేశారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అబద్దాలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. పంట భూముల్ని లాక్కోవటం అన్యాయం అంటూ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు బీజేపీ మీద పోరాటం చేస్తున్నాయి. బీజేపీ కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. ఇది అక్టోబర్ రెండో తేదీ లోపు వీగిపోయే ప్రమాదం ఉంది. ఈలోగానే తొందర తొందరగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం బావిస్తోంది.
ఇది మోసాల ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం మొత్తంగా మోసాల మీద నడుస్తోంది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి... ఇలా అన్నింటా మోసాలే. ప్రభుత్వమే మోసాలు చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలి. అధికారం ఎల్లకాలం చంద్రబాబు దగ్గరే ఉండదు. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ భూములను పూలల్లో పెట్టి వెనక్కి ఇచ్చేస్తాం.
బంద్ కు కలిసిరండి
ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఇప్పుడు మభ్య పెడుతున్నారు. ఈ హోదాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకు, ప్యాకేజీ వస్తే సరిపోతుంది అని చెబుతున్నారు. ఓటుకి కోట్లు కేసునుంచి తప్పించుకొనేందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. అందుకే ఈనెల 29 న బంద్ పాటిస్తున్నాం. ప్రజలంతా ముందుకు వచ్చి ఈ బంద్ ను విజయవంతం చేయాలి.