రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఉన్నత విద్యకు పేదలు దూరం కావాల్సిందేనా?
06 Sep 2012 1:44 AM
హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో లాగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలరా? పెద్ద చదువులకు పేద విద్యార్థులు దూరమయ్యే రోజులు వస్తున్నాయా? ఇప్పటికే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు విధించి అసలు ఫీజుకే ఎసరు పెట్టిన ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఇంకెంత మందిని ఈ పథకం నుంచి దూరం చేస్తుందో? అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా? ఉంటే.. సజావుగా అమలు జరుగుతుందా?.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. డబ్బు లేని కారణంగా పేదలు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న సదాచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పథకంపై అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరితో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
విద్యను సామాజిక పెట్టుబడిగా భావించని ప్రభుత్వం :
సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు విధించి అసలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే గగనంగా మార్చివేసిన ప్రభుత్వం ఏకంగా ఫీజు రీయింబర్స్మెంట్కే ఎసరు పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెరిగిన నేపథ్యంలో పెరిగిన ఫీజునంతటినీ తాము చెల్లించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మిగిలిన కోర్సుల ఫీజులు పెరిగితే కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తే తాము పెద్ద చదువులకు దూరం కావాల్సిందేనా అనే సందేహం పేద విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. విద్యకు పెట్టే ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించకుండా, ఆర్థిక భారంగానే చూస్తూ పథకం మౌలిక స్ఫూర్తి అయిన ‘శాచ్యురేషన్ విధానాని’కే తూట్లు పొడిచిన ప్రభుత్వ వైఖరి పట్ల సామాన్య ప్రజలు, విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఫీజుల పథకం పట్ల ప్రభుత్వ వైఖరిని విద్యావేత్తలు పూర్తిగా తప్పుపడుతున్నారు. అసలు ఈ పథకం అమలు విషయంలో ఆర్థిక భారం దిశగానే ప్రభుత్వం అలోచిస్తున్నది కానీ, అర్హులైన పేద విద్యార్థులకు ఎలా న్యాయం చేయాలనుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ మంచి ర్యాంకు వచ్చిన పేద విద్యార్థి మంచి కళాశాలలను ఎంచుకున్నా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించదని, ప్రతిభ లేకపోయినా ఏ సౌకర్యం లేని కళాశాలను ఎంచుకున్న విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని చెప్పడం సరి కాదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఇవ్వాలి తప్ప ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వ వైఖరి గందరగోళానికి దారితీస్తోందన్నారు. అందరికీ ఫీజు రీయింబర్స్ చేయడం ఆచరణలో సాధ్యం కాదనుకుంటే ప్రభుత్వమే సొంతంగా కళాశాలలు ఏర్పాటుచేసి ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.
కొనసాగించే ఆలోచన ఉందా.. ? :
అసలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే ఆలోచనే ప్రభుత్వానికి ఉంటే ఎనిమిది మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ఫ్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు. పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ముందుకు వెళుతున్నారని, ఇప్పటికే రకరకాల నిబంధనలతో లక్షలాది మందిని పథకం నుంచి దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లోపాలుంటే సరిదిద్దాలి :
మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పథకం అమలులో లోపాలుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలే తప్ప పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అసలు లోటుపాట్లు లేని ప్రభుత్వ పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు లేకపోతే అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
వైయస్ పథకం వల్లే ఇంజనీరింగ్ చదువుతున్నా :
‘మాది పేద కుటుంబం. నాన్న చనిపోయారు. అమ్మ సరోజ కరీంనగర్ కమలాపురంలో ఇంటిదగ్గర టైలరింగ్ చేస్తుంది. ఎంసెట్ 2461 ర్యాంకు వచ్చినా డబ్బులు కట్టి ఇంజనీరింగ్ చదివించే స్థోమత మాకు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ చదవడం నాకల.. అది నిజమైంది. అమ్మ ఎంత కష్టపడ్డా ఇంజనీరింగ్ విద్య అందేది కాద’ని ఎ.నవిత తెలిపింది.
ఆంక్షలు సరికాదు :
నాణ్యమైన విద్యను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేదరికం కారణంగా ఉన్నత చదువులకు విద్యార్థులు దూరం కాకూడదనే వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకువచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దీనిపై ఆంక్షలు విధించడం సరికాద’ బయోటెక్నాలజీ విద్యార్థి కిరణ్ అన్నాడు.
మంచి కాలేజీలో చదువుతున్నా :
‘మాకు వచ్చిన ర్యాంకుతో మంచి కాలేజీలో పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్తో చదవడం సంతోషంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని నీరుగార్చడం సరి కాదు. విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పుకునే ప్రభుత్వం విద్యా పథకాలు తీసేయడం మంచిది కాద’ ని మరో విద్యార్థి రాజేశ్ కుమార్ తెలిపాడు.
విద్యను సామాజిక పెట్టుబడిగా భావించని ప్రభుత్వం :
సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు విధించి అసలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే గగనంగా మార్చివేసిన ప్రభుత్వం ఏకంగా ఫీజు రీయింబర్స్మెంట్కే ఎసరు పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెరిగిన నేపథ్యంలో పెరిగిన ఫీజునంతటినీ తాము చెల్లించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మిగిలిన కోర్సుల ఫీజులు పెరిగితే కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తే తాము పెద్ద చదువులకు దూరం కావాల్సిందేనా అనే సందేహం పేద విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. విద్యకు పెట్టే ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించకుండా, ఆర్థిక భారంగానే చూస్తూ పథకం మౌలిక స్ఫూర్తి అయిన ‘శాచ్యురేషన్ విధానాని’కే తూట్లు పొడిచిన ప్రభుత్వ వైఖరి పట్ల సామాన్య ప్రజలు, విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఫీజుల పథకం పట్ల ప్రభుత్వ వైఖరిని విద్యావేత్తలు పూర్తిగా తప్పుపడుతున్నారు. అసలు ఈ పథకం అమలు విషయంలో ఆర్థిక భారం దిశగానే ప్రభుత్వం అలోచిస్తున్నది కానీ, అర్హులైన పేద విద్యార్థులకు ఎలా న్యాయం చేయాలనుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ మంచి ర్యాంకు వచ్చిన పేద విద్యార్థి మంచి కళాశాలలను ఎంచుకున్నా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించదని, ప్రతిభ లేకపోయినా ఏ సౌకర్యం లేని కళాశాలను ఎంచుకున్న విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని చెప్పడం సరి కాదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఇవ్వాలి తప్ప ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వ వైఖరి గందరగోళానికి దారితీస్తోందన్నారు. అందరికీ ఫీజు రీయింబర్స్ చేయడం ఆచరణలో సాధ్యం కాదనుకుంటే ప్రభుత్వమే సొంతంగా కళాశాలలు ఏర్పాటుచేసి ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.
కొనసాగించే ఆలోచన ఉందా.. ? :
అసలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే ఆలోచనే ప్రభుత్వానికి ఉంటే ఎనిమిది మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ఫ్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు. పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ముందుకు వెళుతున్నారని, ఇప్పటికే రకరకాల నిబంధనలతో లక్షలాది మందిని పథకం నుంచి దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లోపాలుంటే సరిదిద్దాలి :
మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పథకం అమలులో లోపాలుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలే తప్ప పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అసలు లోటుపాట్లు లేని ప్రభుత్వ పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు లేకపోతే అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
వైయస్ పథకం వల్లే ఇంజనీరింగ్ చదువుతున్నా :
‘మాది పేద కుటుంబం. నాన్న చనిపోయారు. అమ్మ సరోజ కరీంనగర్ కమలాపురంలో ఇంటిదగ్గర టైలరింగ్ చేస్తుంది. ఎంసెట్ 2461 ర్యాంకు వచ్చినా డబ్బులు కట్టి ఇంజనీరింగ్ చదివించే స్థోమత మాకు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ చదవడం నాకల.. అది నిజమైంది. అమ్మ ఎంత కష్టపడ్డా ఇంజనీరింగ్ విద్య అందేది కాద’ని ఎ.నవిత తెలిపింది.
ఆంక్షలు సరికాదు :
నాణ్యమైన విద్యను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేదరికం కారణంగా ఉన్నత చదువులకు విద్యార్థులు దూరం కాకూడదనే వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకువచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దీనిపై ఆంక్షలు విధించడం సరికాద’ బయోటెక్నాలజీ విద్యార్థి కిరణ్ అన్నాడు.
మంచి కాలేజీలో చదువుతున్నా :
‘మాకు వచ్చిన ర్యాంకుతో మంచి కాలేజీలో పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్తో చదవడం సంతోషంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని నీరుగార్చడం సరి కాదు. విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పుకునే ప్రభుత్వం విద్యా పథకాలు తీసేయడం మంచిది కాద’ ని మరో విద్యార్థి రాజేశ్ కుమార్ తెలిపాడు.