మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
స్మార్టు సిటీల్లోనూ టీడీపీ నిర్లక్ష్యం..!
27 Aug 2015 6:12 PM
స్మార్టు సిటీల కేటాయింపులోనూ అన్యాయమే
పట్టించుకోని టీడీపీ
అందని ద్రాక్ష సామెత
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధాన ప్రకటనలో మరోసారి రాష్ట్రానికి అన్యాయం ఎదురైంది. స్మార్ట్ సిటీల ప్రకటనలో మూడంటే మూడు నగరాలకు చోటు దక్కింది. 12 రాజధాని నగరాలతో సహా 98 నగరాలకు ఇందులో చోటు కలిపించారు. కానీ రాష్ట్రం నుంచి సరైన ఒత్తిడి లేకపోవటంతో మూడింటితో సరిపెట్టారు.
అన్యాయం జరిగిందిలా..!
స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాల చొరవ కనిపించింది. స్మార్ట్ సిటీల కోసం అభ్యర్థన పెట్టుకొన్న నాటి నుంచి సంబంధిత డాటా అందించటం దాకా ఆయా ప్రభుత్వాల శ్రద్ధ అవసరం. అందుకే చుట్టుపక్కల రాష్ట్రాలు అధికంగా స్మార్టు సిటీలను దక్కించుకొన్నాయి. కర్నాటక కు 6, మహారాష్ట్ర కు 10, తమిళనాడు కి 12 దక్కాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొదట నుంచీ కేంద్ర పథకాలు, వాటికి అనుగుణంగా వివరాల్ని అందిస్తూ వచ్చాయి. దీంతో పని తేలిక అయింది.
పట్టించుకోని టీడీపీ
రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలుగుదేశం ఎప్పుడూ పట్టించుకోవటం లేదు. ఓటుకి కోట్లు కుంభకోణం కేసు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెడితే, ప్యాకేజీల గురించి మంత్రులు శ్రద్ధ చూపించారు. ఫలితంగా కేంద్రానికి అవసరమైన డాక్యుమెంటేషన్, చొరవ కరవైంది. ఫలితంగా స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి మిగిలింది.
అందని ద్రాక్ష సామెత
ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా ప్యాకేజీల మీద దృష్టి పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు కూడా అదే పోకడ అవలంబిస్తోంది. దీంతో రాష్ట్రానికి సరైన న్యాయం జరగటం లేదు. ఇప్పుడు స్మార్ట్ సిటీల గురించి కూడా అలాగే వదిలేసిన రాష్ట్ర సర్కారు పైకి మాత్రం పెదవి విరుస్తోంది.