మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు పొలంలో ఎర్రచందనం దుంగలు..!
14 Apr 2016 5:46 PM
()
సీఎం పొలంలో ఎర్రచందనం
()
అటవీ అధికారుల
దాడిలో వెల్లడి
() బయటపడుతున్న చంద్రబాబు అక్రమాలు
హైదరాబాద్: అవినీతి అంతుచూడనిదే నిద్రపోను.. నేను నిప్పు.. అని ఊకదంపుడు ఉపన్యాసాలు
చేసే చంద్రబాబు అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మొన్న ఇసుక కుంభకోణం..నిన్న
రాజధాని భూ దురాక్రమణ..నేడు ఆయన సొంత పొలంలోనే ఎర్రచందనం దుంగలు లభ్యం.
అక్రమాలకు ఆధ్యుడిగా ముఖ్యమంత్రి మారడం సిగ్గుచేటు. ఎర్రచందనంపై అనునిత్యం
పోరాటం చేస్తానని చెప్పుకొనే సీఎం చంద్రబాబు సొంత గ్రామంలోని పొలాల్లోనే అక్రమంగా
దాచిన ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అయితే ఈ నెపం తనపైకి రాకుండా
ఉండేందుకు తానే స్వయంగా ఈ విషయాన్ని అధికారుల ముందు బయటపెట్టి, అధికారుల వైఖరీపై సీఎం మండిపడినట్లు
హడావుడి చేశారు. ఈ విషయం బయటకు వస్తే తన పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఇటీవల చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంత
గ్రామంలోని పంట పోలాల్లో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. కొంతమంది స్మగ్లర్లే
ఈ కలప దుంగలను అక్రమంగా పంట పొలాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని
అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన వాటిని స్వాధీనం చేసుకొని వాటిని అక్కడి
నుంచి తరలించారు. ఈ విషయం బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పల్లెలోని పంట పొలాల్లోనే ఎర్రచందనం దుంగలు
బయటపడడాన్ని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు నెపాన్ని అటవీ అధికారుల మీదకు
నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో
విషయాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నించిన అధికారులు తలల పట్టుకొన్నారు.