కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చెదరని సంకల్పంతో తరలి వచ్చిన జనం
26 Oct 2013 1:11 PM
హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:
భారీ వర్షాలు, విపరీతమైన వరదలు సమైక్య వాదుల సంకల్పాన్ని ఏమాత్రం చెదరగొట్టలేకపోయాయి. వానలు, వరదలతో ఒక పక్కన ఇళ్లు కూలిపోతున్నా, పంట నీట మునిగిపోయి నాశనమవుతున్నా, చివరికి జన జీవితమే స్తంభించిపోతున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. రైళ్లు, బస్సులు, జీపులు.. ఇలా ఏది దొరికితే ఆ వాహనంలోనే సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ తరలి వచ్చారు. వేలు, లక్షల సంఖ్యలో అలా తరలివచ్చారు.. మధ్యాహ్నానికి ఇంకా వస్తూనే ఉన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం జరిగే సమైక్య శంఖారావం సభకు హాజరయ్యేందుకు సీమాంధ్రలోని పదమూడు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు బయల్దేరి వచ్చారు.
సభ ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం రెండు గంటలకే అయినా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని తెల్లవారు జాము నుంచే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి... ఇలా అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, జీపులు, కార్లలో సమైక్య వాదులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేలాదిగా శుక్రవారం సాయంత్రమే బయల్దేరారు. వీరంతా శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకున్నారు.
నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద నుంచి వారంతా ఎల్బీ స్టేడియం వైపు తరలివచ్చారు. ఎల్బీ స్టేడియానికి ఇప్పటికే చేరుకున్న పలువురిని అక్కడి నుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపుతున్నారు. స్టేడియం బయట మరెంతో మంది లోపలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్న గట్టి విశ్వాసం తమకు ఉందని.. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టాలని సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రజలు ముక్తకంఠంతో ఎలుగెత్తి చెబుతున్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ఏకైక లక్ష్యమని సభకు తరలి వచ్చిన సమైక్య వాదులంతా ఒకే మాట చెబుతున్నారు. తమ ప్రాంతాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నా.. వాటివల్ల కలిగే నష్టం కంటే విభజన వల్ల శాశ్వతంగా కలిగే నష్టమే ఎక్కువని అంటున్నారు. తమతో పాటు తమ బిడ్డల జీవితాలను కూడా రాష్ట్ర విభజన సర్వనాశనం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందు కోసమే విభజనను అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న తమ డిమాండును ఢిల్లీ గల్లీల్లో కూడా గట్టిగా వినిపించేలా సమైక్య శంఖారావాన్ని పూరించి తీరాలని చెబుతున్నారు.