కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
అవిశ్వాసం కంటితుడుపేకేనా ?
19 Jul 2018 6:11 PM
– ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదంటున్న సుజనా
– విప్ ఉన్నా ఓటేసే ప్రసక్తే లేదంటున్న జేసీ
– అవిశ్వాసంతో చక్రం తిప్పుతానంటున్న బాబు
– కాలక్షేపంతో పక్కదోవ పట్టిస్తున్న టీడీపీ
‘అంతనాడు లేదు ఇంతనాడు లేదు.. సంతనాడు కట్టింది ముంతంత కొప్పు’ అని నాలుగేళ్లు రాష్ట్ర సమస్యలపై నోరు మెదపని చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీపై నోరు లేపుతున్నాడు. పైపై నాటకాలకు తెరదీశాడు. పోరాడాల్సినంత కాలం కేంద్రానికి సాగిలా పడి స్వలాభాలు నెరవేర్చుకుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొండాటకు తెరతీశాడు. రాష్ట్ర సమస్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలంటే టీడీపీకి నవ్వులాటగా తయారైంది. కేంద్రంపై ఎప్పట్నుంచో అవిశ్వాసం పెడదాం కలిసి రమ్మని వైయస్ఆర్సీపీ ఎన్నిసార్లు పిలిచినా నోరు మెదపని చంద్రబాబు.. హోదాతో ఏమొస్తుందని... ప్యాకేజీ బాగుందని ప్రచారం చేశాడు. మీడియా కూడా ప్యాకేజీ గురించే ప్రచారం చేయాలని సూచించాడు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోరుతూ వైయస్ఆర్సీపీ 13 సార్లు అవిశ్వాసం పెట్టింది. టీడీపీ కూడా కలిసి రావాలని అడిగింది. మొదట అంగీకరించిన చంద్రబాబు.. వైయస్ఆర్సీపీకి మైలేజీ రావడం ఇష్టం లేక వెనక్కి తగ్గాడు. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగితే మద్దతు కూడగడతామంటూ కాంగ్రెస్తో పొత్తు కోసం చర్చలు చేసొచ్చిన ఘనత చంద్రబాబుది. ప్రతి పనిలోనూ ఆదాయాలు, లాభాలు వెతుక్కునే అలవాటున్న చంద్రబాబు.. రాష్ట్రం కోసం పోరాడాల్సిన ప్రతి సందర్భంలోనూ నోరెత్తకుండా మిన్నకుండిపోయి బలం తగ్గిపోయిన సందర్భంలో అవిశ్వాసమంటూ సొంత క్రెడిట్ కోసం పాకులాడుతున్నాడు. మీరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. తీరా వైయస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాల లేఖలను స్పీకర్ ఆమోదించాక.. కాంగ్రెస్తో కలిసి వచ్చి అవిశ్వాసం పేరుతో పార్లమెంట్లో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. మొదట్లోనే అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్తో ఆమోదింపజేసుకునేలా చేసుంటే.. వైయస్ఆర్సీపీ ఎంపీలు కూడా అవిశ్వాసానికి సహకరించేవారే. ఆనాడే జగన్ చెప్పినట్టు ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఉండేది.
టీడీపీ నవ్వులాట..
ఒకవైపు ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నారు. అవిశ్వాసం పెట్టి మోడీ ప్రభుత్వాన్ని వణికిస్తామని చంద్రబాబు డాంభికాలు పోతున్నారు. కానీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. అవిశ్వాసం పెట్టినంత మాత్రాన మోడీ ప్రభుత్వ కూలిపోతుందా?.. వారికి స్పష్టమైన మెజారిటీ ఉందని చాలా ఎగతాళిగా చెప్పడం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది. చంద్రబాబేమో ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెబుతంటే సుజనా మాత్రం తీరిగ్గా వడియాలు ఎండబెట్టినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ల సంగతిలా ఉంటే మరో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మాత్రం విప్ లేదు.. పప్పులేదు.. పార్లమెంట్కు వచ్చేది లేదు.. ఓటేసిది లేదని ఖరాఖండిగా చెబుతున్నాడు. వీరేదో హోదా సాధించుకొస్తారని ప్రజలెంత సీరియస్గా ప్రయత్నిస్తున్నా... టీడీపీ నాయకులు మాత్రం టైంపాస్ నిరసనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.