చంద్రబాబుకు మావోయిస్ట్ ల హెచ్చరిక

ఏపీ ప్రభుత్వానికి మావోల బహిరంగ లేఖ
సెక్స్ రాకెట్ నిందితులను శిక్షించాలని హుకూం
చంద్రబాబు టీడీపీ నేతలను రక్షించడంపై ఆగ్రహం
దోషులను ప్రజాకోర్ట్ లో అంతమొందిస్తామని హెచ్చరిక

విజయవాడః
ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న దారుణాలపై మావోయిస్ట్ లు  కన్నెర్రజేశారు.
ప్రజలను పీల్చిపిప్పిచేస్తూ రాక్షస పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ పై
భగ్గుమన్నారు. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి మావోయిస్ట్ లు బహిరంగ లేఖ
రాశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను ప్రభుత్వం రక్షిస్తోందని మావోలు
లేఖలో పేర్కొన్నారు. కాల్ మనీ  బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే
ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. సెక్స్ రాకెట్ దుర్మార్గులను
ప్రజాకోర్టులో హతమారుస్తామని హెచ్చరించారు. 

కాల్
మనీ నిందితులను రక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు తలమునకలై ఉన్నారని మావోలు
మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గాలం వేసి, అధిక వడ్డీల
పేరుతో వేధించి...కాల్ మనీ ముసుగులో వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి
దింపిన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే,
ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని
మావోలు ధ్వజమెత్తారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్
దురాగతాన్ని మరుగున పరచడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పనిచేస్తోందని
మావోలు లేఖ ద్వారా వెల్లడించారు. వేతనాల పెంపు కోసం 'ఛలో విజయవాడ'
కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద డ్రామాగా మావోయిస్టులు
వర్ణించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రజలను, రాజకీయ పార్టీలను పక్కదారి
పట్టించేందుకు ఇదంతా చేశారని చెప్పారు. 

కాల్
మనీ సెక్స్ రాకెట్ దోషులకు శిక్షించే వరకు పోరాడాలని ప్రజలు, రాజకీయ
పార్టీలు, మహిళా సంఘాలకు మావోలు పిలుపునిచ్చారు. ఇటీవలే బాక్సైట్ తవ్వకాలను
నిరసిస్తూ  మావోలు విశాఖలో బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జీవోను
రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

Back to Top