బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
టీడీపీకి ఓటేసిన పాపానికి..!
26 Oct 2015 3:02 PM
గుంటూరు(మల్కాపురం): టీడీపీకి ఓటేసిన పాపానికి ప్రజలంతా చింతిస్తున్నారు. భూమి ఇవ్వలేదన్న కక్షసాధింపుతో పచ్చనేతలు తన చెరకు పంటను తగలబెట్టారని బాధిత రైతు గద్దె చిన చంద్రశేఖర్ ..ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు వాపోయాడు. తుళ్లూరు మండలం మల్కాపురంలో దుండగులు చిన చంద్రశేఖర్ చెరకు పంటను దగ్ధం చేశారు. వారికి అండగా నిలిచిన వైఎస్ జగన్ ...కాలిన పంటను సందర్శించి వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు.
ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వనందునే తన పంటను తగులబెట్టారని బాధితుడు వైఎస్ జగన్ ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినందుకే.... తమకు ఈదుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భూములు ఇవ్వకపోవడం తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వబోమని చెబుతున్నా బలవంతంగా లాక్కుంటున్నారని ఈసందర్భంగా పలువురు రైతులు వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ అన్నదాతల తరపున పోరాడుతానని వైఎస్ జగన్ వారికి భరోసా కల్పించారు.