వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పన్నుబాదుడుకు రంగం సిద్ధం
29 Sep 2016 11:45 AM
()టీడీపీ పన్నుల వాత..పేదలపై పెను భారం
()మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి వాయిదా
()తక్షణమే పెంచితే ప్రజలు ఓట్లేయరని భయం
()ఎన్నికల తర్వాత పెంచాలని బాబు నిర్ణయం
బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట... ఎన్నికలు పూర్తయ్యాక మరోమాటతో ప్రజలను వంచిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపబోమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలయిపోయాయి, ప్రజలతో పనైపోయిందన్న రీతిలో ఛార్జీల మోత, పన్నుల వాత పెడుతున్నారు. త్వరలోనే పట్టణ ప్రజలపై పెను భారం మోపడానికి రంగం సిద్ధం చేశారు.
అయితే తక్షణం పన్నుల భారం వేస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని ఆ ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు కాగానే పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నుతో పాటు ఇతర మున్సిపల్ పన్నులు, యూజర్ చార్జీలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నెల 22వ తేదీన జరిగిన మంత్రివర్గ సమాశం అజెండాల్లో పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులన్నీ పెంచేందుకు వీలుగా ముసాయిదా విధానాన్ని ఆమోదించారు.
కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద రాష్ట్రంలో 31 సిటీలను గుర్తించారు. ఆ సిటీలతో పాటు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆ పథకం కింద కేంద్రం నుంచి నిధులు రావాలంటే సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులు పెంపునకు కేబినెట్ సమావేశానికి మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ ప్రతిపాదనలను చేసింది. ఐతే, త్వరలో కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లకు, రాజంపేట, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆస్తి పన్ను ఇతర పన్నులను పెంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయంతో సీఎం ఆ ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయాలని చెప్పారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులు పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇలా ఉండగా మరో పక్క అనంతపురం, గోదావరి, నెల్లూరు, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా ఈ నెల 22న జరిగిన మంత్రివర్గ సమావేశం అజెండాలో మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ పెట్టింది. పట్టణాభివద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం సమజసం కాదనే అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో వీటిపై నిర్ణయాన్ని కూడా ఎన్నికల తర్వాత తీసుకునేందుకు వాయిదా వేశారు. పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తే అన్ని రకాల పన్నులు రెట్టింపు అవుతాయి.