దుబారాకు లోటు లేదు



– పేద రాష్ట్రం అంటూనే విచ్చలవిడి ఖర్చులు
– ఖజానాపై భారం మోపుతున్న చంద్రబాబు 
– కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైతే రూ. 8.72 లక్షల ఖర్చు
– బిత్తరపోయిన కుమారస్వామి సర్కారు


 గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదన్నట్టు..  ఒకపక్క రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో  ఉందంటూనే మరోపక్క చంద్రబాబు విచ్చలవిడి ఖర్చులకు ఏమాత్రం వెనకాడటం లేదు. సొంత పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ పర్యటనలు, హోటల్‌ ఖర్చులు, ఇంటి మరమ్మతులు, సొంతంగా ప్రత్యేకమైన బస్సు.. ఇలా చంద్రబాబు చేసే ప్రతి పనివెనుకా చేసిన ఖర్చుల గురించి ఆలోచిస్తే కేవలం పబ్లిసిటీ కోసం.. పది మందిలో తానే ప్రత్యేకంగా కనిపించాలని తపనపడే స్వభావం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నవ నిర్మాణ దీక్షలు, ఉక్కుదీక్ష, ధర్మ పోరాట సభలు, జన్మభూమి, ప్రత్యేక కార్యక్రమాలు, జలహారతి... లాంటి కార్యక్రమాలు అన్నీ కలుపుకుంటే.. చంద్రబాబు ఖజానాను లూఠీ చేసిన విషయం కళ్లు బైర్లు కమ్ముతోంది. పెట్టుబడులు తీసుకొస్తానంటూ ఆయన 13 దేశాల్లో 21 సార్లు పర్యటించారు. శంకుస్థాపన ఖర్చులు, విదేశీ కన్సల్టెంట్‌లకు ఫీజుల చెల్లింపులు, ఆయన ఇళ్ల నిర్మాణం, మరమ్మతులు, అన్నీ కలుపుకుంటే బాబు నాలుగేళ్లలో బాబు ఖర్చులు 2620 కోట్లకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు. 
పరామర్శలకు కూడా భారీ ఖర్చు..
అభివృద్ధి పేరు చెప్పి చంద్రబాబు ఇంత భారీగా ఖర్చుచేస్తే పరామర్శల పేరిట ప్రముఖులు చనిపోయినప్పుడు వెళితే ఆ భారం కూడా ప్రజలపైనే. అది కూడా భరించలేనంతగా. ఈ మధ్యనే కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు అయిన ఖర్చు చూసి వారు బిత్తరపోయారు. ఆయనకు అక్షరాలా రూ. 8,72,485 ఖర్చయింది. ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు రూ. 1.67 లక్షలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు రూ. 1.02 లక్షలు, సీతారాం ఏచూరి రూ. 64 లక్షలు ఖర్చయ్యాయి. చంద్రబాబు దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు చేయగా.. మిగతా అందరికీ రెండు లక్షలు కూడా దాటలేదు. ఈ ఖర్చు కర్నాటక ప్రభుత్వం చూసుకున్నప్పటికీ.. మిగతా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇతర కేంద్ర మాజీ మంత్రులు, జాతీయ నాయకులకు చంద్రబాబుకు పెట్టినంత ఖర్చు కారకపోవడం గమనార్హం. పక్కనే ఉన్న బెంగళూర్‌కు వెళితేనే చంద్రబాబు వారితో ఇంత ఖర్చు పెట్టించాడంటే.. ఏ కశ్మీరో, ఢిల్లీ, రాజస్థాన్‌ అయితే వారు భరించడం కష్టమైపోయేదే. ఈ లెక్కన చూసుకుంటే మొన్న జయలలిత చనిపోయినప్పుడు.., నిన్న కరుణానిధి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మన ప్రజలపై ఎంత భారం వేసుంటాడో అని అనుమానం రావడం మామూలే.  

తాజా వీడియోలు

Back to Top