కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
బాబు రూటే సపరేటు
18 Dec 2017 12:50 PM
ఇప్పటిదాకా నడుస్తున్నది ఒకతీరు. ఇకరేపటి నుంచి సరికొత్త తీరుకు బాబుగారు శ్రీకారం చుట్టారు. సాక్షాత్తు రాష్ట్రా డీజీపీ నియామకం పద్ధతిని తనదైన తీరులోకి మార్చుకున్నారు. మామూలుగా యూపీపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సభ్యులుగా ఉండే కమిటీ ఏం చేసేదంటే సీనియారిటీ, ట్రాక్ రికార్డు, నిజాయితీ ఆధారంగా ముగ్గురు అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. అందులో ఒకరిని మాత్రమే నియమించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. గతంలో ఉత్తర ప్రదేశ్ డీజీపీ నియామకం కేసులో సుప్రీం కోర్టు తన తీర్పులో ఇదే అంశాన్ని స్పష్టం చేసింది కూడా. అయితే ఏపీ ప్రభుత్వం డీజీపీ ఎంపికలో కేంద్రంతో సంబంధం లేకుండా తామే నియమించుకునేలా చట్టాన్ని సవరించామని ప్రకటించింది. ఇది సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు, న్యాయనిపుణులు అంటున్నారు.