జగన్‌కు బెయిలు.. చెన్నైలో జేజేలు

‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన అభిమానులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. చెన్నై నగరంలోని పలువురు అభిమానులు అనేక కూడళ్లలో సంబరాలు చేసుకున్నారు. బాణసచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. 'జై జగన్.. జైజై జగన్' నినాదాలు హోరెత్తించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ధీశాలి అని పార్టీ ప్రచార కమిటి కో ఆర్డినేటర్, సినీనటుడు విజయచందర్ ‌అభివర్ణించారు.   
చెన్నై :

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డికి తమిళనాడులోనూ విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన కుమారుడు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో తమిళనాడు ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీ జగన్ బయటకు వచ్చే రోజు కోసం ఆ‌తృతగా వారు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో శ్రీ జగన్‌కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరైంది. ఈ సమాచారం ‌చానళ్ళ ద్వారా తెలుసుకున్న తమిళనాడులోని వైయస్ అభిమానులు ఆనందంలో ముగినిపో‌యారు. సంబరాలు జరుపుకున్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తమిళనాడు విభాగం ‌నాయకులు శరత్, జాకీర్‌హుస్సేన్, శరవణన్ భారీ సంఖ్యలో అభిమానులతో చెన్నై నగరంలోని విజయరాఘవ రోడ్డుకు చేరుకున్నారు. భారీ ఎత్తున బాణసంచా ‌కాల్చి సంబరాలు జరిపారు. జై జగన్ నినాదంతో ఆ ప్రాంత‌మంతా మార్మోగిపోయింది. అభిమానుల హడావుడితో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.‌ శ్రీ జగన్‌కు బెయిల్ మంజూరైన సమయంలో చెన్నైలోనే ఉన్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నాయకుడు గడ్డం వెంకట కృష్ణారెడ్డి అభిమానులతో కలిసి సంబరాలు నిర్వహించారు. నగర ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంబరాల్లో పాల్గొన్న సినీనటులు, పార్టీ సీనియర్ ‌నాయకుడు విజయచందర్ మాట్లాడారు.‌

కుట్రలు నిలవవు: విజయచందర్‌:
రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవలేవని జగన్‌కు బెరుుల్ మంజూరుతో నిరూపణ అయిందని విజయచందర్ అన్నారు. సోనియాగాంధీకి ఎదురునిల్చి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపిన ధీశాలి జగన్ అన్నారు. ఆయన జైలు నుంచి విడుదల కావడం అభిమానులకు పెద్ద పండుగలా మారిందని చెప్పారు. గడ్డం వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు టీడీపీతో కుమ్మకై జగన్‌పై అక్రమకేసులు బనాయించి జైలు పాలుచేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ పార్టీ ప్రభంజనాన్ని, జగన్‌పై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేక పన్నిన కుట్రలు పటాపంచలై పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. నగరంలో జరిగిన సంబరాల్లో ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అలాగే తమిళనాడులోని తిరువళ్లూరు, పళ్లిపట్టు, వేలూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజమండ్రికి చెందిన శివప్రసాద్ అనే జగన్ వీరాభిమాని తన సహోద్యోగులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

తెలుగు జాతికే పండుగ : సినీనటి దివ్యవాణి:
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ ‌రావడం తెలుగుజాతికే పండుగ. కుట్రపూరిత కేసులతో 16 నెలలుగా శ్రీ జగన్ జై‌లుఓ మగ్గిపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేకపోయారు. ప్రజల ప్రార్థనను దేవుడు మన్నించాడు‌. ఏసు ప్రభువు కరుణించాడు. జగనన్న జైలు నుంచి బయటకు వచ్చారు.

న్యాయమే గెలిచింది : తమిళనాడు తెలుగు సమాఖ్య మహిళ అధ్యక్షురాలు సత్యాదేవి:
శ్రీ జగన్ చేస్తున్న ధర్మపోరాటంలో న్యాయదేవత కరుణించింది. బెయి‌ల్ మంజూరు చేసింది. తండ్రి మరణించిన నాటి నుంచి ప్రజల్లోనే తిరుగుతూ వై‌యస్ఆర్ లేని లోటును తీర్చే ప్రయత్నంలో కుళ్లు రాజకీయాల కారణంగా‌ శ్రీ జగన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. రాబోయే కాలంలో ప్రజాశీస్సులే‌ శ్రీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తాయి.

ఆనందకరం : అనకాపుత్తూరు మున్సిపల్ మాజీ చై‌ర్‌పర్సన్ భారతీకుమా‌ర్‌:
శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తమిళనాట ఉన్న తమలాంటి వారిని వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణం తీవ్రంగా బాధించింది. తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆవేదన కలిగించాయి. ఇది వరకు ఓ మారు ‌'జగన్ కోసం' శీర్షిక ద్వారా మా ఆవేదన వెలిబుచ్చాను. ఏ రోజుకైనా శ్రీ జగన్ బయటకు వస్తారని ఆశించాం. ఆ కల నెరవేరడం ఆనందంగా ఉంది.

Back to Top