రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు మనిషే పవన్
28 Jul 2018 4:09 PM
– చంద్రబాబు ప్రోద్భలంతోనే పర్యటనలు, పరామర్శలు
– ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షంపై విమర్శలు
– వైయస్ జగన్ గెలుస్తాడనే భయంతోనే దూషణలు
– అనుమానాలను నివృత్తి చేస్తున్న పర్యటనలు
గెలుపోటములు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని పొగడకపోతే ఇగో అనుకున్నాం కానీ.. అసందర్భోచితంగా తిడుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే. కొన్నాళ్లు చంద్రబాబును పొగడటం, పాలన దిగజారుతున్న కొద్దీ విమర్శించడం.. జగన్ సభలకు జనం బ్రహ్మరథం పడుతుంటే తానూ బయటకొచ్చి ప్రభుత్వంపై కస్సు బుస్సులాడుతుంటే మాత్రం బాబు- పవన్ల రహస్య స్నేహం మీద అనుమానం వచ్చి తీరుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి మాటలకే పరిమితం అయ్యింది ఎవరో.. ఓడిపోయినా నాలుగేళ్లుగా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతున్నది ఎవరనేది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. పవన్ కల్యాన్ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం సమంజసమో కాదో విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం ఇది. పవన్ ఎవరి కోసం బయటకొచ్చి పర్యటనలు చేస్తున్నారో.. ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు విమర్శించాల్సి వస్తుందో ఆలోచిస్తే వంద అనుమానాలు కలుగుతాయి. సరైన నాయకత్వం ఎన్నుకొకపొతే రాష్ట్రం ఎంత నష్టపొతుందొ ఇప్పటికే ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడంతో చవి చూసారు. ప్రజలకు అండగా ప్రజా సమస్యల మీద అవగాహన గల నేత గా ఎవరు ప్రజలకి మేలు చేయగలరో బేరీజు వేసుకోవాలి. వివరాల్లోకి వెళితే పవన్ మీద చంద్రబాబు అనుకూలుడు అని వస్తున్న ఆరోపణలకు గల కారణాలు, వాస్తవాలు విశ్లేషించుకుంటే.. చంద్రబాబు మనిషి పవన్ అని ఎవరైనా అనాల్సిందే..
1) జగన్ వెనకాలే పవన్ పర్యటన
2015 మార్చ్ 3 –– తాడేపల్లి , మంగళగిరి, తుల్లూరు మండలాలలొ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పర్యటన చేయగానే వెంటనే అక్కడికి పవన్ కళ్యాణ్ (రెండు రొజులకి) 2015 మార్చ్ 5 న ఉండవల్లి, ఎరబ్రాలెం, బేతపుడి, తుల్లూరు లొ పర్యటించారు. (రాజధాని అవసరమే రైతులని ఒప్పించి తీసుకోండి అని సలహాæ ఇచ్చి వచ్చారు )
2) ధర్నా కి పిలుపిచ్చిన జగన్, దానికన్నా ముందు పర్యటన పెట్టుకున్న పవన్
ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు భూసేకరణ పై ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు ఆగస్టు 25–2015 న బంద్ కి పిలుపునిచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్ అంతకుముందే 26 న ధర్నాకి పిలుపునిచ్చి ఆయనే స్వయంగా వస్తా అన్నారు. ఇలా అన్నారో లేదో పవన్ కల్యాన్ అక్కడికి వచ్చి బలవంతంగా భూములు లాక్కోవద్దు.. వాళ్ళకి నచ్చితే తీసుకోండి ∙అని ప్రభుత్వానికి చెప్పారు.
అక్కడ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరకతని జగన్ ఎక్కడ లాభం పొందుతాడో అని పవన్ ని అడ్డం పెట్టి పవన్ చెప్పాడు భూసేకరణ తాత్కాలికంగా వాయిదా వేశారు అనే భావన కలిగే లా చెసి. (తరువాత గుట్టుచప్పుడు కాకుండా బెదిరించి భయపెట్టి భూసేకరణ చేసేరు బయటకి రాజధాని రైతులు మొత్తం ఇష్ట పూర్వకంగా 33వేల ఎకరాలు ఇచ్చారు అని చెప్పారు )
3) ప్రత్యేక హోదా జగన్ బంద్కి పిలుపు, పవన్ దేశ సమగ్రత ట్వీట్ విన్నపం
2015 ఆగస్టు 10 న ఢిల్లీలో జగన్ ప్రత్యేక హŸదా కోసం భారీ ధర్నా చేశారు. 15 రోజులకి అంటే అగస్టు 25న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి , ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజినే బాగుంటది అని చెప్పారు. దీంతో జగన్ ప్రత్యేక హోదా ఇచ్చే లా చంద్రబాబు మోడీ ∙మీద ఒత్తిడి ఎందుకు తేలేకపొతున్నారు.. వాళ్లకన్నా ముందే మీరు ప్యాకేజి కి ఎందుకు అనుకులత చూపిస్తున్నారు అని కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ఆగస్టు 29 న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు. కానీ పవన్ ఆగస్టు 28 న (బంద్ కి ఒక్కరొజు ముందు పవన్ ఇలా ట్విట్ చేశారు – నేను విభన వలన జరిగిన నష్టం ని మోడీకి వివరించాను సానుకూలంగా స్పందించారు, వారు ఇచ్చిన హామిని నెరవేరుస్తారు అని భావిస్తున్న , దేశ సమగ్రత దష్టి లొ పెట్టుకుని భావొద్వేగాలకి పొకుండా ఇంకొంతకాలం వేచి చూద్దం అని ట్విట్ చేశారు పవన్)
4) జగన్తో పాటు విపక్షాలు బంద్ కి పిలుపు , ప్రజలెందుకు పొరాడాలి అని చెప్పిన పవన్
2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి అరుణ్ జైట్లి ప్రెస్ మీట్ పెట్టి , హŸదా లేదు, ప్రత్యేక సççహాయాం చేస్తామని చెపారు , తరువాత రొజు 9వ తారీకున విపక్షాలతొ పాటు జగన్ కూడా 10వ తారీకున రాష్ట్ర బంద్ కి పిలుపుని ఇచ్చారు. పవన్ కల్యాన్ అదే సెప్టెంబర్ 10న కాకినాడ లొ సభ పెట్టి , ప్రజలు ఎందుకు పోరాడాలి.., బీజేపీ పాచిపొయిన లడ్డులు ఇచ్చింది , పార్లమెంటు మెంబర్లు మాత్రమే పొరాడాలి అని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు ( అలా అందులో ప్రజలు భాగస్వామయం వద్దు అన్నారు)
5) జగన్ జై ఆంధ్రప్రదేశ్ , పవన్ సీమాంధ్ర∙హక్కులు
2016 నవంబర్ 6 న విశాఖలో జై ఆంద్రప్రదేశ్ సభ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అది ఎన్నికలలొ చంద్రబాబు, మోడీ కలిసి ఇచ్చిన హామి, ప్రత్యేక హోదా తొనే మనకి మనుగడ అని సభలో ప్రసంగించారు. 2016 నవంబర్ 10 న ( నాలుగు రొజులకి) పవన్ అనంతపూర్ లొ సీమాంధ్ర హక్కుల సభ అని పెట్టి బీజేపీని మీరు అర్ధరాత్రి ఎందుకు ప్యాకేజి ఇచ్చారు.. నాకు మొక్కలంటే ఇష్టం, నేను కూలి పని చేస్తా , అని మాట్లాడారు.
6) అగ్రిగోల్డ్పై జగన్.. వెనకాలే పవన్
2017 మార్చి 23 న జగన్ దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంటా.. మీరు అధైర్య పడొద్దు ఎవరూ ఆత్మహత్య చేసుకొవద్దు, న్యాయం జరిగేలా చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తా. రాబోయే రెండేళ్లలో ఆయన స్పందించకపొతే తరువాత మీకు ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు 1,182 కొట్లు కేటాయించి 14 లక్షల మంది అగ్రిగొల్డ్ భాదితులని నేను ఆదుకుంట , చనిపొయిన వారికి 3 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం , ఎవ్వరి అధైర్య పడద్దు అని భరొసా ఇచ్చి దీక్షS విరమింప చేశారు. సరిగ్గా ఆరు రొజుల తరువాత మార్చ్ 30న పవన్ కళ్యాణ్ గారు అగ్రిగొల్డ్ భాదితులతొ ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేసి అగ్రిగొల్డ్ విషయం కొర్టు లొ ఉంది, ఏజెంట్లది తప్పులేదు ముళ్ళ మీద గుడ్డ పడింది జాగ్రత్త గా తీసుకొవాలి ప్రభుత్వం దీనిని పరిష్కరించాలి అని చెప్పి వెళ్లారు.
7) జగన్ రైతు దీక్ష విరమించిన 30 నిమిషాలకే పవన్ ప్రకటన
రాష్ట్రం లొ దళారీల వలన మిర్చి, పత్తి,కంది,పసుపు రైతులు మద్దతు దర లేక పండించిన పంట అమ్ముకొవటానికి అవస్తలు పడుతుడటం చూసి , ప్రభుత్వం నుంచి ఎంతకి చలనం లేకపొవటం తొ జగన్ గుంటూరు లొ 2017 మే 1,2 తారీకులలొ దీక్ష చేపట్టారు. ఇలా చేపట్టి 2వ తారీకున దీక్ష విరమించగానే, పవన్ రైతులకి మద్దతు ధర కల్పించాలి అని ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబుకి ఏవైతే అనుకూల పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అండగా ఉంటున్నాయో అవన్నీ పవన్ కల్యాన్కి కూడా వత్తాసు పలుకుతున్నాయనేది బహిరంగ రహస్యం. పవన్ ప్రత్యక్షంగా బయటికి వచ్చింది , ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం, చేనేత సభ కొసం. ఇందులోనూ చేనేత సభ కి వాళ్ళు పిలిస్తే వెళ్ళారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ బాధితులను కూడా హైదరబాద్కి పిలిపించుకుని మాట్లాడారు. అదీ వారు అపాయింట్మెంట్ కోరితే. మిగతావన్నీ ఉత్తర భారత దక్షిణ భారత ట్వీట్లే.
8) జగన్ పాదయాత్ర పవన్ ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన
రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలొ అవినీతి, అకృత్యాలు పతాకస్థాయికి చేరి ప్రజలని గ్రామ గ్రామాన కమిటీలు వేసుకుని పీక్కుతింటుంటే, వైయస్ జగన్ వీరికి అండగా ఉండటానికి ఆంధ్ర ప్రదేశ్ లొని ప్రతి జిల్లాకి పాదయాత్రగా వస్తా అని ప్లీనరీ లొ జులై 9 న ప్రకటించారు
పవన్ కల్యాణ్ మాత్రం జులై 31 న ఉద్దానం అని చెప్పి చంద్రబాబుని కలిసి సుమారు గంట సేపు చర్చలు జరిపి బయటకి వచ్చి నేను అక్టొబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాలలొకి వస్తా అని ప్రకటించారు , పైగా నేను కమిట్ అయిన సినిమాలు ఉన్న డైరెక్టర్లని, ప్రొడ్యుసర్లకి నచ్చ చెప్పుకుని వస్తా అని చెప్పారు.ముందు నుండి ప్లానింగ్ ఉంటే సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారు అని ఒక ప్రశ్న.
9) వైయస్ఆర్సీపీ పోలవరం పర్యటన పెట్టుకున్న రోజే పవన్ కూడా
పోలవరంలో జరుగుతున్న అవినీతి ని ప్రజలకి తెలియచేయటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 న పోలవరం పర్యటన చేస్తున్నామని డిసెంబర్ 2 న ప్రకటించగానే , పవన్ కల్యాన్ కూడా అదే రోజున (డిసెంబర్ 7 నే) పోలవరం టూర్ చేస్తామని డిసెంబర్ 5న ప్రకటన విడుదల చేశారు
ఇలా జరిగిన వరుస సంఘటనలు చూస్తే జగన్ అనే శక్తి ని అడ్డుకోవటానికి చంద్రబాబే స్వయంగా పవన్ కళ్యాన్ని ప్రయోగిస్తున్నాడని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున చెప్పేస్తాడు.