సింగపూర్ కంపెనీలకు రాజధాని తాకట్టు

అసెంబ్లీః గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు చక్కగా అబద్ధాలు చెప్పిచ్చారని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ మోసపూరిత పాలనను అసెంబ్లీ సాక్షిగా తూర్పారబట్టారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే ...

రాష్ట్రంలో జీఎస్‌డీపీ గ్రోత్ రేటు 10.99 శాతం ఉందని చెప్పారు
అదే గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ కేంద్రం 7.3 శాతం నమోదు చేసినా, మేం కేంద్రం కన్నా ఎక్కువ నమోదు చేశామని ఊదరగొడుతున్నారు
కేంద్రం చూపించే జీడీపీ గ్రోత్‌రేటును చాలామంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అదే ఎక్కువ అని అంటున్నారు
దానికి కారణం ఏమిటంటే, బ్యాంకులలో 17 శాతం ఎన్‌పీయేలుగా ఉన్నాయి.
బ్యాంకింగ్ రంగం మూలుగుతూ, కొత్త పరిశ్రమలకు రుణాలు ఇవ్వలేకపోతోంది
ఉన్న పరిశ్రమలు 50 - 60 శాతం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి, రెండేళ్లుగా దేశంలో కరువు కాటకాలున్నాయి
దాంతో అక్కడి గ్రోత్‌రేటే ఎక్కువ చూపిస్తున్నారని అంటే, ఇక్కడ మాత్రం 10.99 శాతం వచ్చిందని అంటున్నారు
దేశం కన్నా మనం దారుణంగా ఉన్నాం. హైదరాబాద్ మన నుంచి వెళ్లిపోయాక ఒక్క ఐటీ పరిశ్రమ కూడా మనకు రాలేదు
స్పిన్నింగ్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ మూతపడుతున్నాయి.
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు కరువులు వచ్చాయి, వరదలు కూడా చూశాం
ఇలాంటి దారుణ పరిస్థితిలో రుణమాఫీ కూడా కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఇలాంటి పరిస్థితిలో 10.99 శాతం గ్రోత్ రేటు ఎలా సాధ్యమని అడుగుతున్నాం
ఈయన చెబుతున్న లెక్కలను అడ్వాన్స్ ఎస్టిమేట్లు అంటారు. వాటిలో నిజమెంతో తెలిసేసరికి నాలుగేళ్లు పడుతుంది
అంచనాలను ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు సవరిస్తారు
ఈ నాలుగేళ్లలో ఏమైనా బొంకచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు విపరీతమైన అబద్ధాలు చెబుతున్నారు
గ్రోత్ రేటుకు, ఆదాయానికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే
మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కల వల్ల జరిగే నష్టం ఏంటో చెబుతున్నా
అరుణ్ జైట్లీ 7.3 శాతం గ్రోత్ రేటు చూపిస్తూ.. పరోక్ష పన్నుల ఆదాయం 31 శాతం పెరిగాయని చెప్పారు
ఓవరాల్ ఆదాయం 22 శాతం పెరిగిందని చెప్పారు
మన రాష్ట్రానికి కూడా ప్రత్యక్ష పన్నులు రావు.. పరోక్ష పన్నుల ద్వారానే మనకు వస్తాయి
పెట్రోలు, డీజిల్ మీద మన ప్రభుత్వం వ్యాట్‌కు అదనంగా 4 రూపాయల పన్ను వేస్తోంది. దేశం మొత్తమ్మీద వీటి ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువ
లిక్కర్ మీద వ్యాట్ 190 శాతానికి పెంచారు
భూముల రిజిస్ట్రేషన్ విలువలు కూడా విపరీతంగా పెంచారు
కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్ పన్నులు పెంచారు. విపరీతంగా బాదారు. 
కేంద్రం 7.3 శాతం వృద్ధితోనే 22 శాతం రెవెన్యూ పెరిగిందంటే ...మన గ్రోత్ రేటుకు  ఇంకెంతో ఆదాయం వస్తుందని  అందరూ అనుకుంటారు?
కానీ వాస్తవంగా మన పరిస్థితి ఏంటంటే మన ఆదాయం పెరిగింది కేవలం 13 శాతం. అంటే ఇదైనా తప్పు కావాలి, గ్రోత్‌ రేటు అయినా తప్పు అయి ఉండాలి
మనకు కేంద్రం నుంచి సహాయం చేసేవాళ్లంతా ఏమనుకుంటారు.. ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పురోగతిలో ఉంది, ఇలాంటి రాష్ట్రానికి మనం ఏ రకమైన సాయం చేయాల్సిన పని లేదని, వాళ్ల కాళ్ల మీద వాళ్లు బతుకుతారనే ఇంప్రెషన్ ఇవ్వడం లేదా అని అడుగుతున్నా.
సొంత ఇమేజ్ పెంచుకోడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు సబబు చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు కేంద్రం మూడేళ్లతో కడుతుందని కేంద్రమంత్రుల నుంచి చంద్రబాబు వరకు అందరూ అంటారు
మరోవైపు రూ.1600 కోట్ల రాష్ట్ర నిధులతో ఏ స్టోరేజీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు
చంద్రబాబు ఎక్కడకు పోయినా ప్రైవేటు విమానాలలోనే వెళ్తారు
రాజధాని శంకుస్థాపన కార్యక్రామానికి రూ.400 కోట్లు దుబారా చేస్తారు
పుష్కరాలకు రూ.1600 కోట్లు నామినేషన్ పద్ధతిలో ఖర్చుపెట్టారు.
హైదరాబాద్‌లో సచివాలయానికి మరమ్మతులు, కన్సల్టెంట్లకు నామినేషన్ పద్ధతిలో డబ్బులిస్తారు
విదేశీ టూర్లు, వాటికి మీతో పాటు ఒక సైన్యాన్ని తీసుకెళ్తారు
వీటన్నింటికీ దుబారా ఖర్చు మరో రూ. 200 కోట్లు 
ఇవన్నీ చూస్తే పైనున్న కేంద్రం, బయటి రాష్ట్రాలు ఏమనుకుంటారు.. మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని అనుకోరా?
కేంద్రం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మరో ప్రధానమైన హామీ పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏవిధంగా ఉందో చూద్దాం.
 ప్రాజెక్టును పూర్తి చేయడం కన్నా, బాబు కమీషన్ల మీదే ఎక్కువ చిత్తశుద్ధి చూపుతున్నారు
ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందని 2015 ఆగస్టులో పోలవరం అథారిటీ లేఖ రాసింది
2015 జనవరి నుంచి జూన్ వరకు 2 శాతం మాత్రమే ప్రగతి ఉందని చెప్పారు
కాంట్రాక్టరు ఈ పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రాశారు
2015 అక్టోబర్ 10న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పోలవరం పనితీరును సమీక్షించింది
పనుల పురోగతి 5.52 శాతం అని అందులో చూపించారు
అలా తెలుసుకున్నాక కాంట్రాక్టర్‌ను తీసేసి, కొత్త టెండర్లు పిలవాలి
పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీద ఒత్తిడి తేవాల్సింది పోయి.. ఇదే కాంట్రాక్టరును కొనసాగిస్తూ, ధరల మార్పుతో రేట్లు పెంచుకోడానికి ఈపీసీ కాంట్రాక్టులో లేకపోయినా వెసులుబాటు ఇచ్చారు.
సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో తెచ్చుకోవచ్చని, ఆ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా చెప్పాల్సిన అవసరం లేదని కేబినెట్ సమావేశంలో చెప్పారు
దానిమీద చీఫ్ సెక్రటరీలు సంతకాలు పెట్టడానికి భయపడ్డారు
అసలు కాంట్రాక్టర్లకు రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది, డీజిల్ ధరలు తగ్గాయి, స్టీల్ ధరలు తగ్గాయి. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తామన్నారు. సిమెంటు, అల్యూమినియం రేట్లు సైతం పెరిగిన దాఖలాలు లేవు. మరి ధరలు ఎందుకు పెంచాలి?
కొత్త టెండర్లు పిలిస్తే పాతరేట్లకు గానీ అంతకంటే తక్కువకు గానీ వస్తారేమో.. రేట్లు పెంచి కమీషన్లు తీసుకుంటున్నారు
పోలవరం, ఇతర ఇరిగిషన్ ప్రాజెక్టులు దారుణంగా చేస్తున్నారు
రైట్ మెయిన్ కెనాల్‌కు సంబంధించిన పనిలో ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 22 కోట్ల పనులు తీసేసి, నామినేషన్ ప్రాతిపదికన బాబు బినామీ బొలినేని శీనయ్య కంపెనీకి ఇచ్చారు.
ఎవరి పద్ధతి బాగాలేదో ప్రజలంతా చూస్తున్నారు
సీఎస్ లు సైతం సంతకాలు పెట్టడానికి భయపడుతుంటే ఏమేరకు అవినీతి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం
రాజధానికి అటవీ భూమిని ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చినా చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ కు వెళ్లారు
రాజధాని ప్రాంతంలో భారీస్థాయిలో కుంభకోణాలు జరుగుతున్నాయి
చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటిగా సీఆర్ డీఏను చెప్పవచ్చు
సింగపూర్ కంపెనీ సుర్వానాకు డిటైల్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.12 కోట్లు ఇచ్చారు
ఈ మేరకు చంద్రబాబు స్వయంగా సంతకం చేసిన లేఖ కూడా ఉంది
సింగ్ పూర్ కంపెనీ ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారు
రాజధాని ఎక్కడ వస్తుందని నీకు, నీ బినామీలకు తప్ప ఇతరులకు చెప్పకుండా ఉండడం న్యాయమేనా బాబు
రాజధాని వేరే చోట వస్తున్నట్టు ప్రకటలు చేయించడం మోసం కాదా
నీ బినామీలు రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనలేదా
వాళ్ల భూములకు డిమాండ్ క్రియేట్ చేయడానికి వాటిని రియల్ జోన్ లో పెట్టలేదా?
అసైన్డ్, లంక భూములు కొనడం నేరమని తెలిసినా కొన్నారు
రైతులను భయపట్టి తక్కువ ధరలకు భూములు లాక్కోలేదా?
రూ5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పేదల భూములు కొని మోసం చేశారు
టీడీపీ నేతలు భూములు కొన్నాక రాజధాని ప్రకటించి మీ బినామీలకు మేలు జరిగేలా ప్యాకేజీ ప్రకటించింది నిజం కాదా?
ప్రత్తిపాటి పుల్లారావు  కూడా బినామీ పేర్లతో భూములున్నాయి కాబట్టి ఆమాత్రం రియాక్ట్ అవడం మామూలే. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు.
మీరు చెబుతున్న రూ. 43వేల కోట్లలో పావలా భాగం ఇచ్చేయండి.. మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాం
రేపు ఈ అసెంబ్లీ చూపించి ఇది కూడా నాదేనంటారు.. అదికూడా మీరే తీసుకోండి
అక్కడ ఏం జరుగుతోంది.. ఫలానా చోట రాజధాని వస్తోందని తెలిసి, ఆ విషయాన్ని దాచిపెట్టి అక్కడ చక్కగా భూములు కొనుక్కున్న తర్వాత రాజధాని ప్రకటించడం ధర్మమేనా అని అడుగుతున్నా
అసైన్డ్ భూములకు సంబంధించిన జీవో నెంబర్ 41ను 2016 ఫిబ్రవరిలో ఇచ్చారు.
అసైన్డ్ భూములు కొన్న తర్వాత ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను కొనుక్కోవచ్చంటూ చట్టంలో దిక్కుమాలిన మార్పు చేయడం కరెక్టేనా
రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లను డైవర్ట్ చేస్తూ, సింగపూర్ ప్రైవేటు కంపెనీలు తెచ్చుకోడానికి చివరకు రాష్ట్ర రాజధానిని తాకట్టు పెట్టడం ధర్మమేనా అని అడుగుతున్నా
తొలుత సింగపూర్ ప్రభుత్వం చేస్తుందన్నారు, తర్వాత సింగపూర్ ప్రైవేటు కంపెనీ చేస్తుందని చెబుతున్నారు
చంద్రబాబు నోట మాటలు వస్తుంటే.. అన్యాయస్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది
నామీద కేసులు పెట్టింది చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు కలిసి పెట్టారు
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు ఎలాంటి  కేసులు లేవు
జగన్ కాంగ్రెస్‌లో ఉన్నంతవరకు కేసులు లేవు
కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్లిన తర్వాత వాళ్లు, చంద్రబాబు కలిసి కేసులు పెట్టారు
అయినా అధికారంలో ఉన్న సోనియాగాంధీతో పోరాడేందుకు కూడా నేను వెనకడాలేదు
నా మీద విచారణ వద్దని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోలేదు
చంద్రబాబు ఎంతసేపు మాట్లాడినా సీబీఐ దర్యాప్తుకు అంగీకరించలేదు
దీనినిబట్టి చంద్రబాబు ఏమేరకు నిజాయితీ పరుడో అర్థమవుతున్నది
సింగపూర్ కంపెనీలను రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి తీసుకొచ్చారు
ఇందుకోసం సర్వీసు చార్జీలు కూడా వసూలు చేసే వెసులుబాటు కల్పించడం ఎంతవరకు సబబు?
ఒక పద్ధతిప్రకారం మీకు చెందిన ప్రైవేటు కంపెనీలు సింగపూర్ కంపెనీల పేరిట తీసుకొచ్చారు
Back to Top