రాజ‌ధాని నిర్మాణంలో అధ్య‌య‌నం లోపం..!

విజయవాడ: అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం లేకుండా రాజధాని నిర్మాణం సాగుతోంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డ్డారు. 
 సామాజిక ప్రాంతాలు, నిర్మాణాల‌కు సంబంధించిన నిపుణుల క‌మిటీ అమ‌రావ‌తి లో పర్య‌టించింది. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిటైర్ ప్రొఫెసర్ అమితాబ్ కుందు, జేఎన్ యూ  సీనియర్ ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్యలు ఈ క‌మిటీలో ఉన్నారు.  రైతుల కోరిక మేరకు రాజధాని గ్రామాలలో వీరు పర్యటించారు. సామాజికంగా, భౌగోళికంగా అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం చేయకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమరావతి పై జరుగుతున్న చర్చ కు, ఇక్కడి పరిస్థితులకు మద్య పొంతన లేదని అన్నారు.  పర్యావరణంకు జరుగుతున్న నష్టం పై ఎన్ జి టి లో విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీలు వేయటం అర్ధరహిత మని అన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం సరి కాదన్నారు.  భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల న్యాయ పరమైన చిక్కులే కాక పర్యావరణ ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు.
Back to Top