రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు కనుసన్నల్లో సభ
19 Dec 2015 1:00 PM
అసెంబ్లీః కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోంది. అసెంబ్లీ గేట్లకు తాళాలు వేసి..ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ తో సభనుంచి గెంటించి సభను ఇష్టాను సారంగా నడుపుకుంటున్నారు. అంతేగాకుండానిండు సభలో టీడీపీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సభా నియమాలను మంటగలిపారు. అప్రజాస్వామికంగా నియంత పాలన సాగిస్తూ ప్రతిపక్షాన్ని అణచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపై అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారంటే..ప్రజాస్వామ్యం పట్ల, మహిళపట్ల ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
చంద్రబాబు..
బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నిండు సభలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వీళ్లేం ఎమ్మెల్యేలు, బజారు రౌడీలంటూ చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను దూషించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి రెచ్చిపోయారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఊగిపోయారు. . మాకూ అధికారం ఉంది. వైఎస్సార్సీపీని ఏదైనా చేయగలం . ఎలా నలిపేయాలో మాకు తెలుసంటూ ప్రతిపక్షాన్ని బెదిరింపులకు దిగారు.
విష్ణుకుమార్ రాజు..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. కాల్ మనీపై చర్చించాలని వైఎస్సార్సీపీని కోరినందుకు తాము తల్చుకుంటే రెండు నిమిషాలు పట్టదంటూ ఊగిపోయారు.
అచ్చెన్నాయుడు..
ప్రతిపక్ష నాయకుడిపై మంత్రి అచ్చెన్నాయుడు బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. నోటికి వచ్చినట్లు దూషిస్తూ సభా నియమాలను ఉల్లంఘించారు.