24 గంటల్లో ఏం జరిగిందంటే..

ప్రతిపక్ష నాయకుడు వైైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. నిన్న (సోమవారం) సాయంత్రం అందరినీ ఆందోళన పరిచిన జగన్.. నిదానంగా తెప్పరిల్లుతున్నారు. ఈ 24 గంటలు జరిగిన పరిణామాలు చూసినట్లయితే..

సోమవారం సాయంత్రం.. 
కీటోన్స్ పెరిగినట్లు డాక్టర్ల  వెల్లడి
శోష వచ్చి దీక్ష స్థలిలోనే పడుకొని పోయిన వైఎస్ జగన్
జగన్ చెంత ఉండి సపర్యలు చేసిన తల్లి విజయమ్మ, సతీమణి భారతి

సోమవారం రాత్రి...
అభిమానుల్ని పలకరించేందుకు జగన్ నిర్ణయం
అందరి సమక్షంలో మరో విడత వైద్య పరీక్షలు
పరిస్థితి విషమించిందని, వైద్యసాయం తప్పనిసరి అని డాక్టర్ల సూచన

సోమవారం అర్థ రాత్రి...
విశ్రమించిన వైఎస్ జగన్
బెంగళూరు నుంచి వచ్చిన సోదరి షర్మిల
పడుకొనే పలకరించిన వైఎస్ జగన్

మంగళవారం తెల్లవారు జాము...
4 గంటల సమయంలో శిబిరంలోకి పోలీసులు
దీక్ష కొనసాగిస్తానని చెప్పిన వైఎస్ జగన్
బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించిన పోలీసులు

మంగళవారం ఉదయం....
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిన పోలీసులు
ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్ప ప్రారంభించిన వైద్యులు
మరోసారి టెస్టులు చేయించాలని నిర్ణయం

మంగళవారం మధ్యాహ్నం..
వైఎస్ జగన్ కు వివిధ స్థాయిల్లో చికిత్స అవసరమని నిర్ధారణ
24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని నిర్ణయం
కీటోన్స్, యూరిక్ యాసిడ్ స్థాయిల మీద ఆందోళన
Back to Top