కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ



\
న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఓ లేఖ రాశారు. లాభాల్లో నడుస్తున్న డీసీఐని ప్రైవేట్‌పరం చేయటం సరికాదని లేఖలో ఆయన గడ్కరీని కోరారు.
డీసీఐని ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. తక్షణం ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్రాన్ని కోరారు.  






Back to Top