మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విఎస్ రమాదేవి మృతికి విజయమ్మ సంతాపం
17 Apr 2013 8:14 PM
హైదరాబాద్, 17 ఏప్రిల్ 2013: మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. మొట్టమొదటి భారత మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్గా, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పలు ఉన్నత పదవులు నిర్వహించిన రమాదేవి సారస్వత రంగంలోనూ రాణించిన బహుముఖ ప్రజ్ఞశాలి అని శ్రీమతి విజయమ్మ నివాళులు ఆర్పించారు.
ఏ పదవిలో ఉన్నా రమాదేవి ఆడంబరాను దూరంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేవారని, విమర్శలకు తావివ్వకుండా హుందాగా పదవిని నిర్వహించారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ప్రజాహిత పరిపాలనా వ్యవస్థకు సంబంధించి వి.ఎస్. రమాదేఇ లేని లోటు తీర్చలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. వి.ఎస్. రమాదేవి కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.