స్పీకర్ : వైఎస్ విజయమ్మ : జూలై 22, 2012

రాష్ట్రంలో నేత కార్మికుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు రేపు సిరిసిల్లలో ధర్నా చేయాలన్న తన నిర్ణయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన నాయకులు, ఉద్యమం సంఘాలకు చెందిన నేతలు అర్ధం చేసుకోవాలని : ఈ ధర్నా ప్రజల సమస్య అయినందున, దీనిని తెలంగాణాతోగాని, మరో రాజకీయ అంశంతోనో ముడిపెట్టి చూడవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విజ్ఞప్తి చేసారు. నేతకరులు మన రాష్ట్ర ప్రజానీకంలో అణగారిన సామాజిక వర్గమైనందుకు వారి సమస్యల పరిష్కారంలో మిగితా పార్టీ కూడా కలిసి రావాలని, తాను తలపెట్టిన ధర్నాకు ప్రజా ప్రయోజనాల రీత్యా ఎలాంటి ఆటంకం కల్పించవద్దని కోరారు. ప్రజా సమస్యలమీద పోరాటంలో కలిసికట్టుగా పనిచేయాలని తమ అభిప్రాయాన్ని, నేతన్నకు మద్దతుగా తమ పోరాటానికి మిగితా రాజకీయ పక్షాలు కూడామద్దతు ఇవ్వాలని, పర్యటనకు, ధర్నాకు ఆటంకాలు కల్పించవద్దని విజ్ఞప్తి చేసారు.

Back to Top