రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఇస్రో శాస్త్రవేత్తలకు విజయమ్మ అభినందన
25 Feb 2013 7:10 PM
హైదరాబాద్, 25 ఫిబ్రవరి 2013: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సోమవారంనాడు ప్రయోగించిన పిఎస్ఎల్వి సి-20 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్ర రాజ్యాలకు దీటుగా ముందుకు దూసుకుపోతోందని చెప్పేందుకు పిఎస్ఎల్వి సి- 20 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పిఎస్ఎల్వి సి-20 ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీమతి విజయమ్మ అభినందించారు. మన దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతంగా జరగాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు.