అధికారం కోసం వైయస్‌ జగన్‌ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు

వంకా రవీందర్‌
 పశ్చిమ గోదావరి:  అధికారం కోసం వైయస్‌ జగన్‌ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వంకా రవీందర్‌ అన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, వాటిని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారన్నారు. నమ్మిన కాపులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలన్నారు. కాపులకు మద్దతుగా నిలిచింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. 
 
Back to Top