నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
తణుకు పట్టణంతో వైయస్ఆర్కు అవినాభావ సంబంధం
05 Jun 2018 6:23 PM
పశ్చిమ గోదావరి: తణుకు పట్టణంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అవినాభావ సంబంధం ఉందని వైయస్ఆర్సీపీ నేత
వంకా రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తణుకు పట్టణంతో వైయస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన భార్య వంకా రాజేశ్వరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంలో లోకల్ బాడీకి సరైన నిధులు లేవని మహానేతకు వివరించగానే వెంటనే ఓ జీవో విడుదల చేసి వంద శాతం యూఎండీసీ ప్రాజెక్టులు వచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఆ జీవోతో తణుకులో వాటర్ ప్రాజెక్టు వచ్చిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఏవిధంగా ఉందో ఆలోచించుకోవాలన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మనవాళ్లు అవసరం లేదట..ప్రతిదానికి సింగపూర్ పరుగులు తీస్తున్నారని విమర్శించారు. దోచుకోవడమే చంద్రబాబు,టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చక్కటి ప్రణాళికతో వైయస్ జగన్ ముందుకు వస్తున్నారని, ప్రతి ఒక్కరూ అయన్ను దీవించి, ఆశీర్వదించాలని ఆయన కోరారు.