అనంతలో నాలుగోరోజు ప్రజాసంకల్పయాత్ర


 అనంతపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంత‌పురం జిల్లాలో నాలుగోరోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 29వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలంలో వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకమైన వైయ‌స్ జగన్ 8.30 గంటలకు కల్లుమడి చేరుకొని వైయ‌స్ఆర్ సీపీ జెండా ఎగరవేశారు.  అనంతరం 10.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ గుమ్మేపల్లి చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్టీ జెండాను ఎగరవేస్తారు. మధ్యాహ్నం 12.00 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. రాత్రి 7.30 గంటలకు బస చేస్తారు. 

Back to Top