కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని పెండెకల్ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్లు రావడం లేదని వృద్ధులు వాపోయారు. సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైయస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది.