వెలవర్తిపాడు చేరుకున్న వైయస్‌ జగన్‌

గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 125వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా తాడికొండ‌ నియోజకవర్గంలో కొనసాగుతుంది. శనివారం సరిపూడి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ వెలవర్తిపాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జననేత వెంట నడిచేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు యువత పోటీ పడుతున్నారు.

Back to Top