కమ్మవారిపల్లి చేరుకున్న జననేత

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుంది. నడవలూరు శివారు నుంచి ప్రారంభమైన యాత్ర నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చెల్లవారిపల్లి, సొరకాయపాలెం క్రాస్‌ మీదుగా పాదయాత్ర కమ్మలపల్లికి చేరుకుంది. కమ్మవారిపల్లిలో వైయస్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర ముందుకు సాగుతుంది. అంతకు ముందు నన్నేరులో వైయస్‌ జగన్‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
Back to Top