భీమునిపాడులోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌

వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర 11వ రోజు కర్నూలు జిల్లాలో సాగుతోంది. శనివారం ఉదయం 9.30 గంటలకు మొదలైన పాదయాత్ర ఆళ్లగడ్డలో ముగించుకుని బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దొర్నిపాడు మండలం కంపమెళ్లమెట్ట గ్రామంలో జరిగింది. అక్కడ్నుంచి కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలోకి ప్రవేశించారు. భారీగా ప్రజలు తరలివచ్చి మద్ధతు తెలుపుతుండటంతో పాదయాత్ర నిదానంగా సాగుతోంది. అడుగడుగునా ప్రజలు జననేతకు ఎదురెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. 
Back to Top