61వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ఈ మేరకు 61వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కుప్పంబాదుర్‌ నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఒడ్డుకాల్వ, సూరవారి పల్లె క్రాస్, బలిజపల్లి, పీవీ పురం, రామిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి క్రాస్‌ వరకు సాగుతుంది. 12.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కమ్మ కండ్రిగ, రామచంద్రాపురం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం లక్ష్మీనగర్, నదవలూరు, పాత కందునలవారిపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది. 5.30 గంటలకు వైయస్‌ జగన్‌ 61వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top