58వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 58వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పర్లపల్లి నుంచి ప్రారంభమవుతుంది. 9.30 గంటలకు పైన జీటివానివడ్డు గ్రామం, 10 గంటలకు కింద జీటివానివడ్డు గ్రామం, 10.45 గంటలకు జక్కిడోనా, 11.30 గంటలకు గంటవారిపల్లి, 12.30 గంటలకు బొట్లవారిపల్లి గ్రామాల వరకు పాదయాత్ర సాగుతుంది. 1.15 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.30 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 2.45 గంటలకు నల్లవెంగన్నపల్లి, 4.15 గంటలకు పాతగుంట, 4.45 గంటలకు చెన్నుగారిపల్లె, 5.15 గంటలకు గుండుపల్లి, 6 గంటలకు ఈదురుకుప్పం గ్రామం వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతుంది. 6.30 గంటలకు 58వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top