ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 3200 కిలోమీట‌ర్లు

 
బాగు వ‌ల‌స వ‌ద్ద మొక్క‌ను నాటిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌
విజ‌య‌న‌గ‌రం: కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3200 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 12 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  

జననేత జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో బుధ‌వారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, సాలూరు మండలం బాగు వ‌ల‌స‌ వద్ద 3200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ జెండాను  ఆవిష్కరించి, అక్క‌డ మొక్క‌ను నాటారు. చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. 



కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు
0- వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయ 
500- అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు 
1000- నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు 
2000- పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి
2500- తూర్పు గోదావరి జిల్లా పసలపూడి శివారు 
3000- విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం 


తాజా వీడియోలు

Back to Top