ముచ్చెర్ల నుంచి 266వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 విశాఖపట్నం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 266వ రోజు పాద‌యాత్ర‌ను జననేత ముచ్చెర్ల క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సెంచురియన్‌ యునివర్సిటీ, గిడిజాల, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవాని పాలెం క్రాస్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.   



Back to Top