చెందుర్తి క్రాస్ నుంచి 228వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  
తూర్పు గోదావ‌రి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్‌ రోడ్‌ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్‌ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వైయ‌స్‌ జగన్‌ దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు. 
Back to Top