141వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

 కృష్ణా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైయ‌స్ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02. 45లకు ప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకుని వైయ‌స్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగిస్తారు. 


Back to Top