111వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

గుంటూరు :  వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా పూర్తి చేసుకొని గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మేరకు  ప్రజాసంకల్పయాత్ర 111వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం బాపట్ల శివారు నుంచి  పాదయాత్రను ప్రారంభింస్తారు. అక్కడ నుంచి మూర్తి నగరం మీదుగా కొండుగట్ల పాలెం చేరుకుంటారు. 11 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం  మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అప్పికట్ల, పుండ్లం క్రాస్‌ మీదుగా ఏతూరు చేరుకొని సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్ర ముగిస్తారు. 

Back to Top