71వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌



చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 71వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పూట క్రాస్‌ రోడ్డు, వర్ధరెడ్డి కండ్రిగ, పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.30 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top