ప్రజా సంకల్ప యాత్ర 255వ రోజు షెడ్యూల్‌


విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 255వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. వైయస్‌ జగన్‌ బుధవారం ఉదయం సబ్బవరం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గుల్లేపల్లి, రావులంపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌ వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం చిన్నగొళ్లలపాలెం క్రాస్‌ వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top