237వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పూర్తి అయ్యింది. ఈ నెల 14న  ప్రజా సంకల్ప యాత్ర 237వ రోజు జననేత పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. మంగళవారం ఉదయం తుని నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి  నర్సిపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తారు. శారభవరం, శృంగవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం అనంతరం గాంధీనగర్, వై. దొండపేట జంక్షన్, య్రరవరం జంక్షన్‌ వరకు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది.

 
Back to Top