నెన్నురు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

చిత్తూరు: వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 62వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నెన్నురు నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్‌, కట్టకింద వెంకటాపురం చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం వెంకటాపురం క్రాస్‌​, చల్లావారిపల్లి మీదుగా సొరకాయలపాలెం క్రాస్‌, మతురుపల్లి, పులిగుంట్ల, కమ్మలపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి దేసురివారి కండ్రిగ, రావిళ్లవారిపల్లి మీదుగా పరకల్వ క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.   

తాజా వీడియోలు

Back to Top