మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కుప్పంబాదూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
13 Jan 2018 10:52 AM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 61వ రోజు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ప్రారంభమైంది. శనివారం ఉదయం 8.30 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, రామిరెడ్డి పల్లి మీదుగా గంగిరెడ్డి పల్లి క్రాస్ రోడ్డుకు చేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై కమ్మ కండ్రిగ మీదుగా రామచంద్రాపురం చేరుకుని అక్కడ వైయస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. లక్ష్మీనగర్, నడవలూరు, పాత కందులవారి పల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వైఎస్ జగన్ పాత కందులవారి పల్లిలోనే బస చేస్తారు.