మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
500 కిలోమీటర్ల మైలు రాయికి చేరువలో ప్రజా సంకల్ప యాత్ర
16 Dec 2017 3:52 PM
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నవంబర్ 6వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకవుతూ ముందుకు సాగుతోన్న జననేత పాదయాత్ర ఇవాళ సాయంత్రం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం వద్ద 500 కిలో కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటారు. శనివారం ఉదయం 487.1 కిలోమీటర్ల వద్ద ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రానికి ఆయన 500 మైలు రాయిని అధిగమిస్తారు. వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు ఉట్లూరు గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.