67వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 67వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బస కేంద్రం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి రచ్చగున్నేరు, ఇసుక గుంట, కాపుగున్నేరు క్రాస్, తాండమాన్‌ పురం క్రాస్, చెర్లోపల్లి, మిట్ట కండ్రిగ, టీఎంవీ కండ్రిగ క్రాస్, పానగల్‌ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది.
 
Back to Top