వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగ దంపతులు

అనంతపురం: వైయస్‌ఆర్‌ సానుభూతిపరులు అంటూ మాకు రావాల్సిన పింఛన్‌ మూడు నెలల పాటు నిలిపివేశారని దివ్యాంగ దంపతులు రామాంజనేయులు, చౌడేశ్వరి వైయస్‌ జగన్‌కు వివరించారు. బియ్యం 15 కేజీలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.  పాపను చదివించుకోవడం కష్టంగా ఉందని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.3 వేలు ఇస్తానని, పిల్లలను చదివించే బాధ్యత నాదే అని భరోసా కల్పించారు.
 

తాజా వీడియోలు

Back to Top