231వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 231వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం శంఖవరం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి శృంగారవరం, బంగారయ్యపేట వరకు సాగుతుంది. మ«ధ్యాహ్న భోజనం విరామం అనంతరం రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top