153వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌


కృష్ణా జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం జననేత వైయ‌స్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం నుంచి ఉదయం ఏడున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. తోటమాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2.45 వరకు మధ్యాహ్నా విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నా క్యాంపు నుంచి పాదయాత్ర ఆరంభమౌతుంది. పెడనలో మధ్యాహ్నాం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. కొంకెపూడి వరకు పాదయాత్ర చేసి అనంతరం రాత్రి బస చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top