130వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 130వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. శనివారం ఉదయం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు సంగం జాగర్లమూడి, 9.30 గంటలకు అంగల కుందూరుకు చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2.45 గంటలకు తెనాలి మున్సిపాలిటీ నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుల్తానాబాద్, లె నాలి, పురవేదిక సెంటర్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. తెనాలిలో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 
Back to Top