<br/>కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కోడుమూరు సోమప్ప సర్కిల్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ తాగునీరు, సాగునీరు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం తదితర సాగు సమస్యలపై వైయస్ జగన్మోహన్రెడ్డితో ముఖాముఖి మాట్లాడేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులంతా తరలిరావాలని కోరారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. <br/><br/>