పిఠాపురం నుంచి 226వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 
తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ్రామ గ్రామానా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. బుధ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ 225వ రోజు  పాద‌యాత్ర‌ను పిఠాపురం ప‌ట్ట‌ణం నుంచి  ప్రారంభించారు. అక్క‌డి నుంచి గొల్ల‌ప్రోలు మీదుగా తాటిప‌ర్తి క్రాస్ వ‌ర‌కు కొన‌సాగుతోంది. జననేత వైయ‌స్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్నతనయుడు ముందుకు సాగుతున్నారు. 




Back to Top