36వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

అనంతపురం:   వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ విడుదల చేశారు. శ‌నివారం ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్క‌డి నుంచి చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు జ‌న‌నేత‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించి వైయ‌స్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.  

Back to Top