35వ రోజు పాదయాత్ర షెడ్యూల్


 
 అనంతపురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 35వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇదే నియోజకవర్గంలోని అనంతపురం రూరల్‌ మండలం కందుకూరుకు 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ జెండా ఎగురవేస్తారు. తర్వాత 11.30 గంటలకు హంపాపురం క్రాస్‌ రోడ్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30కు చిగిచర్ల వరకు పాదయాత్ర కొనసాగించి అక్కడ రాత్రి బస చేస్తారు. 
 

Back to Top